23. తద్విహీనం జారాణా
మివ
గోపికాంగనల
ప్రేమ భగవంతుని మాహాత్మ్యం తెలియనిదైతే అది వ్యభిచారమే అవుతుందేమో ?
అని సంశయం.
ఒకవేళ
గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను వారికంటే వేరుగా, కేవలం
గొప్ప వాడిగా చూచినట్లైతే, ఆ
శ్రీకృష్ణుని కీర్తిస్తూ, పూజిస్తూనే
ఉండిపోయేవారు. వారి భక్తి అప్పుడు కాయిక, వాచిక
భక్తి అయ్యుండేది. కాని ఆ గోపికాంగనలు శ్రీ కృష్ణుని హృదయాంతరంగలో పెట్టుకుని
తన్మయులై ఉన్నారు కదా ! శరీరధారిగా అవతరించిన పరమాత్మను భగవంతుడిగా భావించి
ఆలింగనం చేసుకుంటే అది జారత్వ మెలాగవుతుంది? అవతార్
మెహెర్ బాబాను భగవంతునిగా నమ్మిన స్త్రీ భక్తులు ఆయనను ఆలింగనం చేసుకోలేదా ?
ఇరువురూ అజ్ఞానులైతే అది జారత్వ మౌతుంది గాని ఒకరు భగవంతుడైనప్పుడు రెండవ
వాడైన అజ్ఞానిలో దివ్యత్వం ప్రకాశింప బడుతుంది. అప్పుడు ఆ భగవంతడు ఒక్కడే
పురుషోత్తముడు ఇతరులు స్త్రీలైనా, పురుషులైనా
సరే, అందరూ స్త్రీలతో సమానం.
కనుక
గోపికాంగనల భక్తిని కామంతో కూడినదిగా శంకించ నవసరం లేదు.